ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్.. డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్ చెప్పారు. వైసీపీ క్రియశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను ముఖ్యమంత్రి జగన్కు పంపారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ టికెట్ను ఆశించారు. అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైసీపీ అవకాశం కల్పించింది. దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డొక్కా నేడు రాజీనామా చేశారు.
Tags :