సీనియర్ నేతలకు కీలక పదవులు కట్టబెట్టిన చంద్రబాబు..
రాజకీయం అంటేనే ఎత్తుకు పైఎత్తులు వేయడం. అలాంటి రాజకీయంలో అపర చాణిక్యుడు చంద్రబాబు. పొత్తుల కారణంగా పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని అణచివేయడానికి చాలా తెలివిగా నిర్ణయం తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఎన్నికల ముంగిట.. సొంత ఇంట్లో కలహాల గొడవలు ఎందుకు అని భావించిన చంద్రబాబు పార్టీలో సీనియర్ నేతలకు కీలక పదవులు కట్టబెట్టారు. దీనివల్ల పార్టీలో అంతర్గతంగా ఏర్పడే చిన్నపాటి కలహాలు గాలివానగా మారకుండా ఈ నేతలు అడ్డుకట్ట వేస్తారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రమణ్యం, విశాఖ లోక్ సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా గండి బాబ్జి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ ను నియమించారు. హిందూపురం లోక్ సభ నియోజకవర్గం అధ్యక్షుడిగా బీవీ వెంకట రాముడు.. టీడీపీ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శులుగా సీఎం సురేశ్, మన్నే సుబ్బారెడ్డి, కొవ్వలి యతిరాజా, రామ్మోహన్ నాయుడు, ముదునూరి మురళీకృష్ణంరాజు, వాసురెడ్డి ఏసుదాసు లకు బాధ్యతలు అప్పగించారు.