భారతీయులైతేనే అమెరికాలో... సీఈవో ఛాన్స్ : గార్సెట్టి
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. అగ్రరాజ్యంలో సంస్థ సీఈవో అయ్యే అవకాశాలు భారతీయులకే ఎక్కువగా ఉంటున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు భారతీయులైతే అమెరికాలో సీఈవో కాలేరని గతంలో ఓ జోక్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి దీనికి బిన్నంగా ఉంది. భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేరనే విశ్లేషణలో ఎలాంటి సందేహం లేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్, స్టార్బక్స్ లాంటి కంపెనీలే ఉదాహరణ. ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ప్రతీ 10 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లలో ఒకరికంటే ఎక్కువ అమెరికాలో చదువుకున్న భారత వలసదారులే ఉన్నారు అని గార్సెట్టి వ్యాఖ్యానించారు. ప్రపంచ అభివృద్ధి కోసం సాంకేతిక విప్లవానికి కేంద్రంగా భారత్`యూఎస్ నిలుస్తున్నాయని అన్నారు.