ASBL NSL Infratech

ఆంధ్రాలో నామినేషన్ పరిశీలన ప్రక్రియ ముగింపు..

ఆంధ్రాలో నామినేషన్ పరిశీలన ప్రక్రియ ముగింపు..

ఏపీలో మే 13న జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల కోసం వేసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఏప్రిల్ 25 తో ముగిసింది. అయితే ఈరోజుతో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్ సభ స్థానాలకు.. 686 నామినేషన్లు రాదా వీటిలో 503 నామినేషన్లకు ఆమోదం లభించింది. లోక్ సభ కోసం అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో 183 తిరస్కరించడం జరిగింది. ఏపీ లో లోక్ సభ కు అత్యధికంగా గుంటూరు పార్లమెంటు స్థానానికి 47 నామినేషన్లు రాగా అతి స్వల్పంగా శ్రీకాకుళం స్థానానికి 16 నామినేషన్స్ దాఖలయ్యాయి. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే 175 స్థానాలకు గాను 3,644 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కేవలం 2,705 నామినేషన్లకు ఆమోదం లభించక 939 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికలకు అత్యధికంగా తిరుపతి నుంచి 52 నామినేషన్లు రాగా..అత్యల్పంగా చోడవరం నుంచి 8 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ ఉపసంహరించడానికి గడువు ఈ నెల 29 తో ముగుస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :