ASBL NSL Infratech

అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నా

అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నా

వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్‌ కడప ఎంపీ టికెట్‌ ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన అనంతరం ఇడుపులపాయలో ఆమె మీడియాతో మాట్లాడారు. సాక్ష్యాధారాలు ఉన్న వివేకా హంతకులు నేటికీ తప్పించుకొని తిరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. దారుణంగా చిన్నాను చంపితే గుండెపోటుతో చనిపోయారని సాక్షి టీవీలో చూపించారు. ప్రజలు హర్షించరని తెలిసి కూడా అవినాష్‌కే జగన్‌ టికెట్‌ ఇచ్చారు. నేను ఎంపీగా పోటీ చేయాలనేది చిన్నాన్న చివరి కోరిక. అందుకే ఆయనపై కక్షగట్టి హతమార్చారు. సునీత న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కనికరం లేకుండా ఆమె పైనే ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ బిడ్డగా ఏం చేయాలో ఆలోచించాను. హత్యా రాజకీయాలకు మేం వ్యతిరేకం. వైసీపీ నిందితులకు టికెట్‌ ఇచ్చింది. అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నా అని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :