ASBL NSL Infratech

ఈ విషయంపై సీఎస్ తో మాట్లాడాను : వైఎస్ షర్మిల

ఈ విషయంపై సీఎస్ తో మాట్లాడాను : వైఎస్ షర్మిల

పింఛన్లు పంపిణీ చేయకుండా వైసీపీ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌  పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పంపిణీకి రాష్ట్రంలో ఉద్యోగులు లేరా? అని నిలదీశారు. పింఛన్ల పంపిణీ ఆలస్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఈ విషయంపై సీఎస్‌తో మాట్లాడాను. 3వ తేదీ నుంచి వారం పాటు పెన్షన్లు ఇస్తామని తెలిపారు. లబ్ధిదారులు పింఛను అందుకునేందుకు 10 రోజులు నిరీక్షించాలా?  డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా ఇవ్వాలని ఈసీ ఆదేశాలిస్తే ఎందుకు అమలు చేయడం లేదు? డీబీటీ ద్వారా వెంటనే  పింఛన్లను పంపిణీ చేయాలి. లేకపోతే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడతాం అని హెచ్చరించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :