ASBL NSL Infratech

వైసీపీ మంత్రులు, నేతలు గాడిదలు కాస్తున్నారా..? : షర్మిల

వైసీపీ మంత్రులు, నేతలు గాడిదలు కాస్తున్నారా..? : షర్మిల

ఏపీలో ప్రత్యేకహోదా అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెస్తుండడంతో.. పునర్విభజన పాపం హస్తానిదే అంటూ వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ హైకమాండ్‌ పై విమర్శలతో విరుచుకుపడుతున్న షర్మిలను టార్గెట్ చేస్తున్నాయి. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున.. ఏపీకి రావాల్సిన డబ్బులును అడిగి తేవాలని మంత్రులు .. షర్మిలకు సూచించారు. అయితే వీటికి షర్మిల సైతం అంతే ధీటుగా కౌంటరిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి తనను డబ్బులు తెమ్మంటున్నారని... తాను డబ్బులు తెస్తే వైసీపీ నేతలు గాడిదలు కాస్తుంటారా అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఐదేళ్లుగా ముద్దులు పెట్టుకుంటూ బీఆర్‌ఎస్‌తో సీఎం జగన్ దోస్తీ చేశారని సెటైర్లు వేశారు. అప్పుడు ఏమైంది మీ దమ్ము... ఇప్పుడు తనను డబ్బులు తీసుకుని రమ్మని అడుగుతారా సిగ్గులేదా అని దెప్పిపొడిచారు. సొంత చెల్లెలు అని కూడా లేకుండా సోషల్ మీడియా వేదికగా అవమానిస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను వైఎస్ బిడ్డను కానని ఒక నిమిషం అనుకుంటాను, దమ్ముంటే రండి.. ఎంత మంది వస్తారో రండి... చూసుకుందాం.. నాపై దాడి చేసే దమ్ము మీకుందా అని సవాల్ విసిరారు. ఎన్నికల వస్తున్నాయని జగన్ అనే కుంభకర్ణుడు నిద్రలేచారని ఎద్దేవా చేశారు. సిద్ధం అంటూ జగన్ సొంత ప్రయోజనాల కోసం ప్రజల దగ్గరకు వస్తున్నారని.. నమ్మకండని చెప్పారు. తాను తెలంగాణలో పార్టీ పెట్టడం గురించి రోజా మాట్లాడుతుందన్నారు. తన పార్టీనీ కాంగ్రెస్‌లో విలీనం చేశానని... కాంగ్రెసు బతికి ఉన్నంత కాలం తన పార్టీ ఉంటుందని షర్మిల తెలిపారు.

వైఎస్ పాలనకు జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల. నగరిలో రోజా దోపిడీ జబర్దస్తీగా చేస్తోందని ఆరోపించారు. నగరిలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారనారు. రోజా, రోజా భర్త, ఇద్దరు అన్నలు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలేనని ఎద్దేవా చేశారు. రోజా, వారి కుటుంబ కళ్లు పడితే నగరిలో సెంటూ స్థలం ఉండదని ఆరోపించారు. ఇసుక, గ్రావెల్, మద్యం దందా నుంచి భూ కబ్జాలకు నగరినీ రోజా అడ్డగా చేసుకుందని మండిపడ్డారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :