ASBL NSL Infratech

రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే.. ఆంధ్రప్రదేశ్ కు : వైఎష్ షర్మిల

రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే.. ఆంధ్రప్రదేశ్ కు : వైఎష్ షర్మిల

నియంత పాలకులను తరిమి కొట్టాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. సీఎం జగన్‌ బీజేపీకి బానిసగా మారానని ఆరోపించారు. సింహం, పులి అని చెప్పుకొనే మీరు బీజేపీ ముందు పిల్లిలా మారారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. వైసీపీ, తెలుగుదేశం, రెండూ బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఎన్నికలప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి అవి మీడబ్బులే. ఇసుక, బాక్సైట్‌, లిక్కర్‌ మాఫియాతో సంపాదించిన డబ్బులే. కానీ, ఓటు మాత్రం ఆలోచించి వేయండి. అల్లూరి సీతారామరాజు బ్రిటీష్‌ పాలకులను ఎలా తరిమి కొట్టారో, నియంత పాలకులను అలా తరిమి కొట్టాలి. ప్రజలపక్షాన నిలబడని, పాలక పక్షం,  ప్రతిపక్షం మనకొద్దు అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :