ASBL NSL Infratech

వైసీపీ భవిష్యత్ కార్యాచరణ ఎలా..?

వైసీపీ భవిష్యత్ కార్యాచరణ ఎలా..?

ఘోర ప‌రాజ‌యాన్ని వైసీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. ఇన్ని సంక్షేమపథకాలు అమలు చేసినా.. ఎందుకింత దారుణ ఫలితాలు వచ్చాయా వచ్చిందా అనే చర్చ పార్టీలో మొదలైంది.ఐదేళ్ల పాల‌న‌లో చేసిన త‌ప్పులేంటి? ప్రజా తీర్పు ఎందుకిలా వచ్చిందన్న అంత‌ర్మ‌థ‌నం ఆ పార్టీలో జ‌రుగుతోంది. అయితే ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌హ‌జ‌మ‌ని, ఏవీ శాశ్వితం కాద‌ని వైసీపీ నేత‌లు త‌మ‌ను తాము ఓదార్చుకుంటున్నారు. కింక‌ర్త‌వ్యం ఏంట‌ని వారు ఆలోచిస్తున్నారు.

కూటమి హామీలపై..

అధికారంలోకి రావడానికి కూటమి .. అనేక హామీలిచ్చింది.అందులో కొన్ని హామీలైతే పరిమితులు లేనివిగా ఉన్నాయి. మరి వాటిని ఎలా అమలు చేయనుంది. అమలుచేయకుంటే ప్రజా వ్యతిరేకత తప్పదు. ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన తర్వాత.. ప్రజల్లో కూడా కూటమి సర్కార్ పై భారీ అంచనాలే ఉంటాయి. వాటిని కూటమి ఎలా రీచ్ అవుతుంది. వీటన్నింటిని కూటమి ఎలా బ్యాలెన్స్ చేస్తుందో అన్న అంశాలపై వైసీపీ ఫోకస్ పెట్టాల్సి ఉంది.

ప్రతీ ప్రభుత్వానికి ఆరు నెలల హానీమూన్ సమయం ఉంటుంది. ఈసమయంలో ప్రభుత్వం కుదురుకోవడం, పాలనపై పట్టు సాధించడం.. సంక్షేమపాలన అందించేందుకు సమాయత్తం కావడం జరుగుతుంది. ఈ ఆరునెలల తర్వాత నెమ్మదిగా విపక్షాలు... పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపుతూ విమర్శలు చేస్తుంటాయి. ఇప్పుడు కూటమి కూడా అంతే.. మొదటి ఆరునెలల గడువిచ్చిన తర్వాత.. వారి మేనిఫెస్టోను , అమలుచేయాల్సిన హామీలను తెరపైకి తేవాల్సిన అవసరముంది.

కూటమి హామీల్లో భాగంగా అర్హులకు 4 వేలు పెన్షన్ ఇవ్వాల్సి ఉంది. ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం, ఏడాదికి ఉచితంగా మూడు సిలిండ‌ర్ల పంపిణీ, ఏడాదికి రూ.20 వేలు చొప్పున రైతు భ‌రోసా, 50 ఏళ్లు పైబ‌డిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు పింఛ‌న్‌, అలాగే ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు చ‌దువుకుంటుంటే అంత మందికి ఏడాదికి రూ.15 వేలు, అలాగే 18 ఏళ్లు పైబ‌డిన ప్ర‌తి మ‌హిళ‌కూ నెల‌కు రూ.1500 చొప్పున పంపిణీ.. ఇలా అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై వుంది.

సమర్థ ప్రతిపక్షంగా..

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు సంబంధించి ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అర్హ‌త‌ల‌కు సంబంధించి ఎలాంటి నియ‌మ నిబంధ‌న‌ల‌ను తీసుకొస్తుందో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ఏ మాత్రం విఫ‌ల‌మైనా... మ‌ళ్లీ వైసీపీకి అధికారం దక్కే అవకాశాలుంటాయి.వైసీపీ నేత‌లు ఓట‌మితో కుంగిపోకుండా ఎంతో స‌హ‌నంతో భ‌విష్య‌త్‌పై ఆశావ‌హ దృక్ప‌థంతో ఎదురు చూడాల్సి వుంటుంది.

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన ఎన్నో పార్టీలు, ఆ త‌ర్వాత కాలంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన దాఖ‌లాలున్నాయి. 2019లో టీడీపీ 23 సీట్ల‌కు ప‌డిపోయి, ఇప్పుడు ఊహించ‌ని విధంగా అధికారంలోకి రావ‌డ‌మే అతిపెద్ద ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌భుత్వ ఫెయిల్యూర్స్ ప్ర‌తిప‌క్షానికి క‌లిసి వ‌స్తుంటాయి. దీన్ని క్యాష్ చేసుకోడానికి ప్ర‌తిప‌క్షం ఓపిక‌గా ఎదురు చూడాల్సి వుంటుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :