దుబాయ్ లో కాప్ సదస్సులో ప్రధాని ప్రతిపాదన ... భారత్ లో
![దుబాయ్ లో కాప్ సదస్సులో ప్రధాని ప్రతిపాదన ... భారత్ లో](https://www.telugutimes.net/storage/news/news_new_65291.jpg)
ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన కాప్ 28 సదస్సు (వాతావరణ మార్పుల సదస్సు) కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సదస్సులో ప్రసంగిస్తూ 2028లో జరగాల్సిన కాప్ 33 సదస్సును భారత్లో నిర్వహిస్తామని ప్రధాని ప్రతిపాదించారు. ప్రపంచ జనాభాలో భరతదేశపు జనాభా 17 శాతం ఉన్నదని, కానీ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో భారత్ నుంచి విడుదలయ్యేది కేవలం 4 శాతమే అని ప్రధాని తెలిపారు. నేషనల్లీ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్(ఎన్డీసీ) లక్ష్యాల సాధన దిశగా తాము వేగంగా కదులుతున్నామని తెలిపారు. ఇతర దేశాలు కూడా కర్బన ఉద్గారాల విడుదల తగ్గించుకోవాలని కోరారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :