ప్లానెట్ గ్రీన్ ఇన్ఫ్రా చైర్మన్ కు ప్రతిష్ఠాత్మక అవార్డు

ఇండియన్ అచీవర్స్ అవార్డ్స్ థర్డ్ ఎడిషన్ లో భాగంగా మోస్ట్ ఇన్స్పైరింగ్ గ్రీన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్లానెట్ గ్రీన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, వేద భారత్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వినయ్ రామ్ నిడదవోలుకి లభించింది. ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 25న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికిపైగా ఎకరాల్లో దేశీయ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు గాను ఈ అవార్డు ఆయనకు వరించింది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పలు విభాగాల్లో అవార్డులు అందుకున్నారు.
Tags :