వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ చిత్రపటం వేలం... 4000 డాలర్లకు కొన్న వంశీకోట
తెలుగువారి ఆరాధ్యనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు అశేష తెలుగు జన సందోహం మధ్య అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి లో మే 21 ఆదివారం రోజున ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటాన్ని వేలం వేయగా గుంటూరుకు చెందిన ఎన్నారై వంశీకోట ఈ చిత్రపటాన్ని 4000డాలర్లకు కొనుగోలు చేశారు. ఎంపి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఎన్నారై టీడీపి నాయకులు జయరాం కోమటి, సతీష్ వేమన చేతుల మీదుగా ఆయన ఈ చిత్రపటాన్ని అందుకున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఎన్టీఆర్ మోడల్ స్కూల్ కు విరాళంగా ఇస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు వంశీకోటను అభినందించారు.
Tags :