ASBL NSL Infratech

అమెరికాలో ఘోర విషాదం

అమెరికాలో ఘోర విషాదం

ఓ పసికందును ఊయలకు బదులుగా పొరపాటుగా ఓవెన్‌లో పడుకోబెట్టింది తల్లి. దీంతో ఆ చిన్నారి కాలిన గాయాలతో అక్కడిక్కడే మరణించింది. ఈ హృదయ విదారక ఘటన అమెరికా మిస్సౌరిలోని కాన్సాస్‌ నగరంలో జరిగింది. ఓ పసికందు ఊపిరాడక అపస్మారక స్థితిలో ఉందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారిని పరిశీలించగా, కాలిన గాయాలతో అప్పటికే మరణించింది. దీనిపై తల్లిని ప్రశ్నించకగా పసికందు నిద్రబుచ్చేందుకు ఊయలకు బదులుగా పొరపాటున ఓవెన్‌లో పెట్టినట్లు పోలీసులకు చెప్పింది. ఈ పొరపాటు పై పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో తల్లి మరియా థామస్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :