ప్రధాని మోదీతో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల భేటీ
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీకి అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అభినందనలు తెలిపింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంపై ప్రశంసలు కురిపించింది. ఢిల్లీలో ఈ బృందం ప్రధానితో భేటీ అయింది. ఏడుగురు సభ్యుల అమెరికా బృందానికి విదేశీ వ్యవహారాల సభా కమిటీ చైర్మన్ మైఖేల్ మెక్ కాల్ నాయకత్వం వహించారు. వాణిజ్యం, సరికొత్త సాంకేతికతలు, రక్షణ సాంస్కృతిక మార్పిడి వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వ్యూహాత్యక బంధానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని మోదీకి వారు హామీ ఇచ్చారు. ఈ బృందంలో మాజీ స్పీకర్ నాన్నీ పెలోసీ, మిల్లర్, గ్రెగరీ మీక్స్, నికోల్, జిమ్ మెక్ గోవర్న్, అమీ బెరా ఉన్నారు.
Tags :