ASBL NSL Infratech

ధర్మకర్తల మండలి సమావేశం... టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే

ధర్మకర్తల మండలి సమావేశం... టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ భూమన కరుణాకరెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలో అర్హులైన ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. అలిపిరి గోశాల వద్ద ఈనెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహణ, ఈ హోమానికి రుసుం రూ.1000గా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శాశ్వత ఉద్యోగులకు రూ.14 వేలు, ఒప్పంద ఉద్యోగులకు రూ.6,850 ఇచ్చేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :