ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. దేవాదాయశాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తలంబ్రాలు కావాల్సిన వారు రాష్ట్రంలోని ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.151 చెల్లించిన వివరాలు నమోదు చేసుకోవాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కోరారు. శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను ఆర్టీసీ బస్భవన్లో ఆర్టీసీ మేనేజింగ్ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాజిస్టిక్ కేంద్రాలతో పాటు తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు భక్తుల నుంచి నేరుగా ఆర్డర్లు స్వీకరిస్తారని తెలిపారు. కావాలనుకున్న వారు ఆర్టీసీ కాల్ సెంటర్ నవంబర్లు 040 2345 0033, 040 6944 0000, 040 6944 0069 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.