ఆడుతూ, పాడుతూ, లెక్కల పోటీలో పాల్గొంటే టెన్షన్ ఏముంటుంది చెప్పండి? ఈ వినూత్న పరీక్షకు హైదరాబాద్ ఓ వేదికైంది
డ్యాన్స్ చేస్తూ , పాటలు పాడుతూ, పిల్లలు లెక్కలు చేస్తే, పరీక్షలు రాస్తే .......ఆ ఆనందమే వేరు కదా పిల్లలకు
ఓ వైపు సంగీతాస్వాదన చేస్తూనే మరోవైపు పరీక్ష రాయడం అనేది సాధ్యమేనా అంటే? సాధ్యమే అంటోంది సిప్ అకాడమీ.
ఓ వైపు ఇష్టమైన పాటల్ని పెద్ద శబ్దంతో వింటూనే, పాటలకు హుషారుగా కాళ్లూ, చేతులూ ఆడిస్తూనే, ఏకాగ్రత చెదరనీయకుండా , క్లిష్టమైన గణిత ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు పూర్తి చేసి ఆహూతులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు
ఆడుతూ పాడుతూ లెక్కలు చేస్తుంటే ఇంకా ఆ ఆనందానికి అవధులు ఏముంటుంది ...... నవ్వుల ఓనమాలు.... అక్షర చేపలు...... మాటల మంత్ర దండం..... భాషా కల్పవృక్షం ఇలా ఆటలతో పాటలు చెప్పడం చూశాం. ఇప్పుడు ఆట పాటలతో పరీక్షలు రాయిస్తున్నారు
నేర్పించడం..... అంటే గంటల తరబడి విద్యార్థులు చేతిలో పుస్తకాలు పెట్టి చదివించడమా? నేర్పించడం..... అంటే విద్యార్థులకు అర్థమైనా కాకపోయినా భయపెట్టి కూర్చోబెట్టడమా ? అవేమి కావు. పిల్లల మనసెరిగి పాటలను, పోటీలను, పరీక్షలను కూడా అతలాగా మార్చగల్గితే ?
అదే జరిగింది ఈ మధ్య మన హైదరాబాద్లో . అదేంటో మీరే తెలుసుకోండి
.అధిక డెసిబుల్స్ తో కూడిన సంగీతానికి డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ పోటీలో లెక్కలు చేస్తుంటే .... ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఈ మధ్య శంషాబాద్ లో ని క్లాసిక్ కన్వెన్షన్ మూడు ఈ వినోత్న పోటీకి వేదిక అయింది. ఆ పోటీ పేరే ప్రొఢజీ 24 . దీనిని భారతదేశం లో అతిపెద్ద చిన్నపిల్లలలో నైపుణ్యాలను నేర్పించే సిప్ అకాడమీ నిర్వహించింది. గత ఇరవై ఏళ్లలో పది లక్షల చిన్నారులకు తర్ఫీదు నిచ్చిన ఈ సంస్థ ఏటా ప్రొఢజీ 24 అనే పోటీని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రొఢజీ 24 రీజినల్ పోటీని హైదరాబాద్లో నిర్వహించింది.
ఆ మా నసిక అంకగణిత పోటీలో 2100, 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు పాల్గొన్నారు. పిల్లల నేర్చుకుంటున్న కోర్సు లెవల్(స్థాయిల--తొమ్మిది ప్లస్ మూడు స్థాయిలు ) బట్టి ఆ పొటీ ప్రాడిజీ 24 మూడు దశల్లో నిర్వహించబడింది . పాల్గొనేవారు వివిధ స్థాయిల అభ్యాసాన్ని బట్టి మూడు రౌండ్లు చేయవలసి ఉంది. ఒక రౌండ్ అబాకస్తో నిర్వహించారు. , ఇది చాలావరకు ప్రారంభకులకు సంబంధించినది, రెండవ స్థాయి "విజువల్ రౌండ్", ఇక్కడ వారు గాలిలో ఊహించి , దృశ్యమానం ద్వారా మానసిక అంకగణితం చేయాలి. ఇది ఉన్నత స్థాయి విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. మూడవ రౌండ్ ఆసక్తికరంగా ఉంది, దీని కోసం పిల్లలందరూ వేచి ఉన్నారు. అది ‘ఏకాగ్రత రౌండ్, మ్యూజిక్ వింటూ ఏకాగ్రత దెబ్బతినకుండా అందరికంటే వేగంగా లెక్కలు చేయగలిగే పరీక్ష.
ఓ వైపు సంగీతాస్వాదన చేస్తూనే మరోవైపు పరీక్ష రాయడం చేశారు. అది సాధ్యమేనా అంటే, సాధ్యమే అంటోంది సిప్ అకాడమీ. ఇదిగో 2000 మంచి చిన్నారులు చేస్తున్నారు చూడండి అని నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యం లో వస్తున్న పాటలకు హుషారుగా కాళ్లూ, చేతులూ ఆడిస్తూనే, మరోవైపు క్లిష్టమైన గణిత ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు పూర్తి చేసి ఆహూతులు అభినందనలు అందుకున్నారు. ప్రోడిజీ -24 పోటీలో భాగంగా 'కాన్సన్ ట్రేషన్ రౌండ్ ' పేరిట 'ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు గణితంలో ఏకాగ్రత పరీక్ష నిర్వహిం చారు. దీనిలో భాగంగా ఓ వైపు ఇష్టమైన పాటల్ని పెద్ద శబ్దంతో వింటూనే ఏకాగ్రత చెదరనీయకుండా విద్యార్థులు మానసిక గణిత విశ్లేషణ పోటీలో పాల్గొన్నారు మరియు హ్యూమన్ కాల్కులేటర్లమని నిరూపించారు. కాల్కులేటర్ల కంటే వేగంగా లెక్కలు చేయాడం విశేషం
తెలంగాణ వ్యాప్తంగా 60 కేంద్రాల నుంచి 2100 మంది విద్యార్థులు ఈ ప్రత్యేక పోటీలో పాల్గొన్నారు. ప్రోడజీ అనేది SIP అకాడమీ యొక్క సిగ్నేచర్ ఈవెంట్ యొక్క 21వ ఎడిషన్.
పిల్లలు పాడటం, నృత్యం చేయడం మరియు దృశ్యమానంగా మొత్తాలను లెక్కించడం మరియు ఆనందించటం జరిగింది. హాల్ లో మొత్తం 4 వేల మంది అనగా రెండు వేల మంది పిల్లలు, 300 మందికి పైగా ఇన్విజిలేటర్లు, ఉపాధ్యాయులు, వాలంటీర్లు మరియు తల్లిదండ్రులతో నిండి ఉంది. ఆ పరీక్షా కేంద్రం / పోటీ ఒక్క సారిగా సంగీత ఖచేరీగా మారింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే విద్యార్థుల దృష్టి మరల్చలేదు. పాడటం మరియు నృత్యం చేస్తున్నప్పటికీ, ఏకాగ్రతను కోల్పోకుండా ఆ చిన్నారులు వారి పని వారుచేసుకుపోయారు
మా అబాకస్ శిక్షణా కార్యక్రమంలో, పిల్లలు అనేక ఇతర విషయాలతోపాటు ఏకాగ్రతను పెంపొందించుకుంటారని మరియు ఏ వాతావరణంలోనైనా దృష్టి కేంద్రీకరించగలరని నిరూపించడానికి దీనిని నిర్వహించడం జరిగిందని SIP అకాడమీ యొక్క సీనియర్ ప్రతినిధి సీబీఐ శేఖర్, డైరెక్టర్ తెలిపారు.
SIP అకాడమీ భారతదేశపు అతిపెద్ద నైపుణ్యాభివృద్ధి సంస్థ, SIP అకాడమీ, 23 రాష్ట్రాలు మరియు భారతదేశంలో 900 కేంద్రాలలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. గత 21 సంవత్సరాలలో 10 లక్షల మంది పిల్లలకు శిక్షణనిచ్చింది మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో ప్రపంచ దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి నివేదిత తోట విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ "ఇక్కడ పిల్లలు మానవ కంప్యూటర్ల లాగా లెక్కలు చేస్తున్న విధానాన్ని నేను గమనించాను." అని అన్నారు. మీరే భవిష్యత్తు. సంఖ్యలు(నంబర్లు) లేని ప్రపంచం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధా ), మెషిన్ లెర్నింగ్ లేదా క్వాంటం కంప్యూటింగ్ ఏదైనా ఆధునిక సానెక్తికతను తీసుకోండి, అన్నీ గణితం తో ముడిపడి ఉంటాయి. గణితాన్ని అన్ని శాస్త్రాల రాణిగా పరిగణిస్తారు. నేడు మ్యాథ్స్లో టెక్నాలజీ, టెక్నాలజీలో మ్యాథ్స్ ఉన్నాయి. మీరంతా మ్యాథ్స్తో స్ట్రాంగ్గా స్టార్ట్ చేస్తున్నారు. ఇది ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి మీకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మీరందరూ గణితాన్ని ఆస్వాదిస్తున్నట్లున్నారు. మీరు పోటీలో పాల్గొనడం చాలా సరదాగా అనిపించింది. మీరు ఒత్తిడి లేని పోటీలో సరదాగా పాల్గొని మీ సత్తా చూపించారు. అన్నారు. మన నూతన విద్యా విధానం కూడా అదే సూచిస్తోంది. మీరే మా భవిష్యత్తు అన్నారు.