మహిళల డబ్ల్యూ15 టోర్నీ లో అమెరికా పై.. తెలంగాణ క్రీడాకారిణి విజయం
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబ్ల్యూ15 టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి విజేతగా అవతరించింది. సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సహజ 6-4, 7-6( 7/4)తో జు అమీ (అమెరికా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన క్రమంలో సహజ టోర్నీ మొత్తం ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ గెలుపుతో అమెరికాలో ప్రొ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారిణిగా సహజ గుర్తింపు పొందింది. గతంలో సానియా మీర్జా ( 2004లో డబ్ల్యూ15-బోకా రాటన్), కర్మన్కౌర్ (2023లో డబ్ల్యూ60-ఈవాన్స్ విల్లె) ఈ ఘనత సాధించారు. తాజా విజయంతో సహజ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్లో 15 స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 305వ ర్యాంక్కు చేరుకుంది.
Tags :