ASBL Koncept Ambience
facebook whatsapp X

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్

బీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. తెలంగాణ మాజీ స్పీకర్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  పోచారంతో పాటు ఆయన కుమారుడూ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఎన్నో సేవలందించారని అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. వ్యవసాయం దండగ కాదని, పండగ చేసే బాధ్యత తమదని తెలిపారు. రైతు సంక్షేమ రాజ్యం కోసం సహకరించే అందరి మద్దతు తీసుకుని ముందుకెళ్తామన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :