మెల్ బోర్న్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ కల్చరల్ ఉత్సవాలు
![మెల్ బోర్న్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ కల్చరల్ ఉత్సవాలు](https://www.telugutimes.net/storage/news/news_new_74338.jpg)
మెల్బోర్న్లో తెలంగాణ కల్చరల్ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మెల్బోర్న్ తెలంగాణ ఫోరం (ఎంటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు తెలుగు మాట్లాడేవారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింభించేవిధంగా ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా రామాయణం, శ్రీరాముడి నేపథ్యంతో కూడిన జానపద నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఈ సందర్భంగా ఎంటీఎఫ్ అధ్యక్షురాలు లక్ష్మీ నూకల మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతీ దినోత్సవం కేవలం వారసత్వానికి సంబంధించినదే కాదని, మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడం పట్ల మనకున్న నిబద్ధతకు నిదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమంలో విక్టోరియన్ మల్టీకల్చరల్ కమ్యూనిటీ చైర్పర్సన్ వివియన్, మెల్బోర్న్లోని ఇండియన్ ఎంబసీ కాన్సుల్ జనరల్ డాక్టర్ సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)