ఎన్నికలొస్తే మోదీకి పాకిస్తానే గుర్తొస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి
![ఎన్నికలొస్తే మోదీకి పాకిస్తానే గుర్తొస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి](https://www.telugutimes.net/storage/news/news_new_73877.jpg)
దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీకి పాకిస్తాన్ గుర్తుకు వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు పేల్చారు. పాకిస్తాన్పై కాంగ్రెస్ ప్రేమ కురిపిస్తోందని మోదీ అంటున్నారని, అయితే ఆ దేశ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు వెళ్లి అక్కడ ఆయనను కౌగిలించుకున్నది ఎవరని ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ తన పదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. చేతనైతే 10 ఏళ్లలో దేశంలో సాధించిన పురోగతిపై మోదీ ప్రోగ్రెస్ కార్డును విడుదల చేయాలి. ఎన్నికలొచ్చాయంటే ప్రధానికి పాకిస్తాన్ గుర్తొస్తుంది. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ని ప్రేమిస్తుందని అంటున్నారు. అసలు పాక్ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు వెళ్లి ఆ దేశ ప్రధానిని కౌగిలించుకున్నదెవరు..? మీరు చేసే మోసం ప్రజలకు కూడా అర్థమైంది. నియంతృత్వ పాలన చేస్తోన్న బీజేపీని గద్దె దించాలని వాళ్లు బలంగా నిర్ణయించుకున్నారు. అందుకే ఈసారి కేంద్రంలో ఇండియా కూటమిని గెలిపించబోతున్నారు. ఈసారి కేంద్రంలో కచ్చితంగా ఇండియా కూటమే అధికారంలోకి రాబోతోంది’’ అంటూ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)