ASBL NSL Infratech

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా... రాష్ట్రంలో

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా... రాష్ట్రంలో

వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పై టీడీపీ నేత వర్ల రామయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో టీచర్ల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారని, విచారణ జరపాలని అధికారులను కోరారు. బదిలీ  కోసం ఒక్కో టీచర్‌ కోసం రూ.3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వసూలు చేశారన్నారు. టీచర్ల బదిలీల్లో రూ. 65 కోట్ల వరకు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక కూడా రాష్ట్రంలో ఉపాధ్యాయులను బదిలీ చేశారని ఆరోపించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :