ASBL NSL Infratech

జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసి పార్టీ ను గెలిపించింది.. వైఎస్ సునీత..

జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసి పార్టీ ను గెలిపించింది.. వైఎస్ సునీత..

జగన్ కు అతని చెల్లెలకు మాటల యుద్ధం ఎప్పటినుంచో జరుగుతూ ఉంది. ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలో వివేకానంద కూతురు వైయస్ సునీత మరొకసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో షర్మిల పాదయాత్ర చేసి పార్టీని గెలిపించిందని సునీత అన్నారు. ఎక్కడ షర్మిలకు తన కంటే ఎక్కువ పేరు వస్తుందో అని జగన్ భయపడ్డారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న జగన్ మొన్న వివేకా ను ఎవరు చంపారు అనే విషయం కడపలో ప్రతి ఒక్కరికి తెలుసు అని అన్నారని సునీత మరొకసారి గుర్తు చేస్తారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ తో మరిన్ని వివరాలు బయటకు వస్తాయని జగన్ భయపడుతున్నారా అని ఆమె ప్రశ్నించారు. దీని పై డిబేట్ పెట్టుకుంటే మరుగున పడ్డ నిజాలు బయటికి వస్తాయని.. అవసరమైతే సాక్షి టీవీకి రావడానికి కూడా తాను సిద్ధమని సునీత పేర్కొన్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయడం పై హర్షం వ్యక్తం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :