శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ. సమస్ర దీపాలంకారణ సేవ చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి.. శ్రీరామపట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించారు. అనంతరం సుగ్రీవుడు, అంగదుడి ఉత్సవమూర్తులతో పాటు ఆంజనేయ స్వామివారికి పుష్పమాలలు సమర్పించారు.
Tags :