శ్రీవారి ఆలయంలో వైభవంగా ..శ్రీరామనవమి ఆస్థానం
![శ్రీవారి ఆలయంలో వైభవంగా ..శ్రీరామనవమి ఆస్థానం](https://www.telugutimes.net/storage/news/news_new_71900.jpg)
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల సేవ, అర్చన అనంతరం రంగనాయకుల మండపం ఉదయం 9 నుంచి 11 వరకు స్నపన తిరుమంజనం కనులపండువగా నిర్వహించారు. వేదపఠనంతో శ్రీవారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 వరకు హనుమంత వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో శ్రీమలయప్పస్వామి కొలువుదీరి భక్తులను కటాక్షించారు. రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారు వాకిలీ వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని పండితులు చేపట్టారు. గురువారం సాయంత్రం 5 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేతం హనుమంతులవారి ఉత్సవర్లకు సహస్ర దీపాలంకార సేవ.. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఆలయ అర్చనకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ పెద్దజీయర్, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)