రాలేలో సతీష్ వేమూరి ప్యానల్ ప్రచారానికి మంచి స్పందన
![రాలేలో సతీష్ వేమూరి ప్యానల్ ప్రచారానికి మంచి స్పందన](https://www.telugutimes.net/storage/news/news_new_65663.jpg)
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికలకు అభ్యర్థులు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా సతీష్ వేమూరి ప్యానెల్ కు చెందిన అభ్యర్థులు, నాయకులు తానా సభ్యులను స్వయంగా కలుసుకునేందుకు ఆయా నగరాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హ్యూస్టన్లో, రాలెలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అభ్యర్థి సతీష్ వేమూరి తన ప్యానెల్ సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రవాసులను కలుసుకుని తమ ప్యానెల్ గెలుపు అవసరాన్ని, ఆవశ్యకతను వివరించి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమాల్లో అశోక్ కొల్లా, శిరీష తూనుగుంట్ల, పుసులూరి సుమంత్, మాధవి ఏలూరి, సుమంత్ రామ్ శెట్టితోపాటు తానా నాయకులు నిరంజన్ శృంగవరపు, తాళ్లూరి జయశేఖర్, ముత్యాల పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :