గోపీచంద్ సినిమాతో వెంకీ మూవీకి కనెక్షన్
![గోపీచంద్ సినిమాతో వెంకీ మూవీకి కనెక్షన్](https://www.telugutimes.net/storage/news/news_new_65701.jpg)
గురు సినిమా నుంచి ఫుల్ లెంగ్త్ యాక్షన్ మాస్ మూవీస్ చేయడం మానేసిన వెంకటేష్ ఇప్పుడు మళ్లీ సైంధవ్ మూవీతో ఆ ట్రాక్ లోకి వచ్చేశాడు. జనవర 13న రిలీజ్ కానున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో వెంకీ చాలా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కనపరిచాడని యూనిట్ మెంబర్స్ అంటున్నారు.
స్క్రీన్ పై వెంకీ వయొలెన్స్ చూసి ఫ్యాన్స్ షాకవ్వడం ఖాయమట. అయితే ఈ సినిమా కథ ఒక ఇంజెక్షన్ చుట్టూ తిరుగుతుందని టాక్. ఒక అరుధైన వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం వాడే ఆ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాలా రూ.17 కోట్లు ఉంటుందట. ఇదే ఇంజెక్షన్ అవసరం విలన్ కు కూడా అవసరమవడంతో వీరిద్దరి మధ్య యుద్ధం మొదలవుతుందట.
దానికి తోడు వీరిద్దరి మధ్య పాత శత్రుత్వం కూడా ఉండటంతో ఆ హింస నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇంచుమించు ఇలాంటి కథే 2007లో గోపీచంద్ హీరోగా వచ్చిన ఒక్కడున్నాడు మూవీది కూడా. కాకపోతే అందులో అరుదైన బాంబే బ్లడ్ కోసం హీరోని చంపేందుకు విలన్ ట్రై చేస్తాడు. ఇక్కడ ఇంజెక్షన్ కోసం వార్ జరుగుతుందని అంటున్నారు. స్టోరీ లైన్స్ కొంచెం సిమిలర్ గా ఉన్నా రెండూ వేర్వేరు కథలని, కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా డైరెక్టర్ శైలేష్ ఈ కథను రాసుకున్నాడని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)