జై హనుమాన్ విషయంలో అవన్నీ ఊహలే!
ఈ ఏడాది రిలీజైన అతి పెద్ద బ్లాక్ బస్టర్ లలో హనుమాన్ ఒటి. ఈ సినిమాకు సీక్వెల్ జై హనుమాన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై ఆడియన్స్ లో ఎన్నో రకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ఓ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. కానీ అది క్యాన్సిల్ అవడంతో ప్రశాంత్ వర్మ టైమ్ చాలానే వేస్ట్ అయింది. ఇక జై హనుమాన్ విషయానికొస్తే ఆ స్క్రిప్ట్ వర్క్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని తెలుస్తోంది. స్క్రిప్ట్ ను ఓ కొలిక్కి తీసుకురావడానికి సంవత్సరం వరకు పడుతుందంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హనుమాన్ నిర్మాతల్లో ఒకరైన చైతన్య రెడ్డి జై హనుమాన్ లో హనుమంతుడిగా చిరంజీవి లేదా రామ్ చరణ్ అయితే బాగుంటుందని చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇది వర్కవుట్ అవడం చాలా కష్టమని అందరికీ తెలిసినప్పటికీ మెగా ఫ్యాన్స్ మాత్రం నిజమవ్వాలని కోరుకుంటున్నారు. ఎంతలేదన్నా జై హనుమాన్ అనుకున్నట్లు తీయాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. ఇదంతా ఇప్పట్లో జరిగే పనికాదు. అసలు ప్రశాంత్ నీల్ మనసులో హనుమంతుడిగా ఎవరిని అనుకుంటున్నాడో తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.