ASBL NSL Infratech

మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మాసైపోతావ్ : సీఎం రేవంత్

మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మాసైపోతావ్ : సీఎం రేవంత్

షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు, అది పాడైపోయిందని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి వంశీచందర్‌ రెడ్డి నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌  ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌ రెడ్డి. మా ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే మాడి మసైపోతావు. పాలమూరులో అనేక ప్రాజెక్టులు చేపట్టాం. పదేళ్లుగా ఈ జిల్లాను ఎడారిగా మార్చారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలి అని ప్రశ్నించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :