ASBL NSL Infratech

ఫిలింసిటీలో ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు రేపు

ఫిలింసిటీలో ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు రేపు

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు ఇవాళ తెల్లవారు జామున మృతిచెందారు. రామోజీరావు పార్ధివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం వద్దకు తరలించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకొని రామోజీరావు పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్కు పిలుపునిచ్చినట్లు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ ప్రకటన ద్వారా ప్రకటించింది.

రేపు (ఆదివారం) ఉదయం రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోఉన్న సీఎం రేవంత్ రెడ్డి రామోజీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలు ఆదివారం ఉదయం రామోజీ ఫిల్మ్సిటీలో ఆయనకు ఎంతో ఇష్టమైన రామోజీ గ్రూప్స్ కేంద్ర కార్యాలయం లాన్ లో నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :