కేంద్రం కీలక ప్రకటన.. ఆ రోజున హాఫ్ హాలిడే
అయోధ్య రామాలయం లో ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా వేలమంది ప్రయాణికులు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విగ్రహ ప్రతిష్ట జరిగే సోమవారం రోజున దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ హాలిడే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆఫీసులన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
Tags :