ASBL Koncept Ambience
facebook whatsapp X

కేంద్రం కీలక ప్రకటన.. ఆ రోజున హాఫ్ హాలిడే

కేంద్రం కీలక ప్రకటన.. ఆ రోజున హాఫ్ హాలిడే

అయోధ్య రామాలయం లో ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా వేలమంది ప్రయాణికులు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విగ్రహ ప్రతిష్ట జరిగే సోమవారం రోజున దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్‌ హాలిడే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆఫీసులన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :