ASBL NSL Infratech

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ నలుగురినీ .. నిందితులుగా చేర్చాలి

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ నలుగురినీ .. నిందితులుగా చేర్చాలి

మాజీ మంత్రి హరీశ్‌రావు నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని బీజేపీ నేత రఘునందన్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులుగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌, వెంకట్రామిరెడ్డి పేర్లనూ చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై 2014 నుంచే విచారణ చేపట్టాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రూ.మూడున్నర కోట్లు పట్టుకున్నా,  కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎందుకు పిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో స్టీఫెన్‌ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడికి పోయాయని అన్నారు. ఈ విషయంలో తాను చేసిన ఫిర్యాదుపై పోలీసులు, ఉన్నతాధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :