రాగావధానం... మరో వినూత్న కార్యక్రమం
![రాగావధానం... మరో వినూత్న కార్యక్రమం](https://www.telugutimes.net/storage/news/news_new_56305.jpg)
న్యూజెర్సిలో నాట్స్ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎడిసన్లోని న్యూజెర్సి కన్వెన్షన్ అండ్ ఎక్స్పొజిషన్ సెంటర్లో జరగనున్న ఈ వేడుకలకు వచ్చే వారికి పసందైన కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాగావధానం పేరుతో ఓ వినూత్నకార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
గానవిద్యా ప్రవీణ, స్వర ఘనాపాఠి, స్వర శుభకర గరికిపాటి వెంకట ప్రభాకర్తో కచేరీని ఏర్పాటు చేశారు. కర్ణాటిక్ క్లాసికల్ మ్యాస్ట్రో, స్వరరాగావధానం కార్యక్రమం సంధానకర్తగా డా. మధు దౌలపల్లి వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రాధ కాశీనాధుని, జయచిళ్ళ, సుధ దేవులపల్లి, రవి కామరసు, రేఖ బ్రహ్మ సముద్రం, అరుణ గరిమెళ్ళ, వేణు ఓరుగంటి పాల్గొంటున్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :