పూరీ నెక్ట్స్.. మామూలు ప్లానింగ్ కాదుగా!
ఒకప్పుడు టాలీవుడ్ కు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన పూరీ జగన్నాథ్ గత కొంతకాలంగా సరైన ట్రాక్ లో లేడనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ అందుకున్న పూరీ, లైగర్ అంటూ విజయ్ దేవరకొండతో చేసిన అటెంప్ట్ దారుణంగా ఫ్లాపైంది. ఆ కారణంతో మళ్లీ పూరీకి ఛాన్సులు రాలేదు. అలాంటి టైమ్ లో పూరీతో మరోసారి చేతులు కలిపి సినిమా చేసేందుకు ముందుకొచ్చాడు రామ్ పోతినేని.
వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాను చేస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా పూరీ డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు డబుల్ ఇస్మార్ట్ హిట్ అయితే తన తర్వాతి సినిమాను నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట.
డబుల్ ఇస్మార్ట్ హిట్ అయితే పూరీ ఓ భారీ మల్టీస్టారర్ ను చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ మల్టీస్టారర్ను ఓ టాలీవుడ్ హీరో, ఓ బాలీవుడ్ హీరోతో చేయాలని పూరీ భావిస్తున్నాడట. పూరీ ట్రాక్ లో లేకపోయినా, తన సినిమాలు ఫ్లాపైనా తన టేకింగ్ మాత్రం గొప్పగా ఉంటుంది. పూరీకి అమితాబ్ తో కలిసి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాలీవుడ్ స్టార్స్ కూడా పూరీ సినిమా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదంతా జరగాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో పూరీ, డబుల్ ఇస్మార్ట్ తో బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే.