మళ్లీ చాలా కాలం తర్వాత ఆ భామతో నాగ్
చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగార్జునకు నా సామిరంగ రూపంలో ఆ విజయం దక్కింది. నా సామిరంగ సక్సెస్ ఇచ్చిన జోష్ లో నాగ్ వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
ఇది కాకుండా నాగార్జున తమిళ డైరెక్టర్ నవీన్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషం తెలిసిందే. జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. సమ్మర్ లోగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని నాగ్ చూస్తున్నాడట. దీంతో పాటూ మరో డైరెక్టర్ సుబ్బు కు కూడా నాగ్ సినిమా చేయడానికి ఓకే అన్నాడట.
కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రియమణిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు ఫిక్స్ అంటున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే గతంలో రగడ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ప్రియమణి మెయిన్ హీరోయిన్ కాకపోయినా నాగ్ తో స్క్రీన్ స్పేస్ చేసుకునే టైమ్ ఎక్కువే ఉంది. మొత్తానికి మళ్లీ 14 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తోందన్నమాట. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.