భారత ప్రధానికి రష్యా అత్యున్నత పౌర పురస్కారం
రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తృత పరిచేందుకు కృషి చేస్తున్నందుకుగానూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రదానం చేశారు. క్రెమ్లిన్లోని సెయింట్ ఆండ్రూ హాలులో ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. 2019లోనే దీనిని మోదీకి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్ నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి నేతగా మోదీ రికార్డు సృష్టించారు. మొదటి అపోజల్ ఆఫ్ జీసస్, పాట్రన్ సెయింట్ అయిన సెయింట్ ఆండ్రూ జ్ఞాపకార్థం దీనిని 1698లో ప్రారంభించారు. ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు స్వీకరించిన అనంతరం మోదీ ప్రకటించారు.
Tags :