ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణలో నామినేషన్ల సందడి

తెలంగాణలో నామినేషన్ల సందడి

తెలంగాణలో నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్‌ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. భారీ ర్యాలీలతో హోరెత్తించారు. కరీంనగర్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరపున కుటుంబ సభ్యులు  నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. హైదరాబాద్‌లో లోక్‌సభ ఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్‌ ఒవైసీ, నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, సికింద్రాబాద్‌ బీజేపీ అభ్యర్థిగా కిషన్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.

ఖమ్మం బీజేపీ అభ్యర్థి వినోద్‌ రావు, పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌,  నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్‌, భువనగిరి సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్‌, బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్‌, మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంశీ చంద్‌ రెడ్డి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :