రామమందిరంపై పోస్టల్ స్టాంప్ లు విడుదల చేసిన మోదీ
అయోధ్య రామమందిరం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రామమందిరంపై స్మారక పోస్టల్ స్టాంప్లను విడుదల చేశారు. రామమందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, శబరిమాతపై మొత్తం ఆరు స్టాంప్లను విడుదల చేశారు. అయోధ్య ఆలయ ఆకృతి, మందిరం ఆవరణలోని కళాఖండాలు, సూర్యభగవానుడు, సరయూ నది ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేశారు. మంగళ్ భవన్ అమంగళ్ హరి అనే కవిత్వాన్ని కూడా ముద్రించారు. దీంతో పాటు శ్రీరాముడిపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 48 పేజీల ఈ బుక్లో 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంప్లను పొందుపర్చారు. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కాంబోడియా దేశాలు సహా ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు శ్రీరాముడిపై స్మారక స్టాంప్లను విడుదల చేశాయి.