ASBL NSL Infratech

టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ వైసీపీ విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. చంద్రబాబు విజన్‌ భావితరాలకు ఎంతో అవసరమన్నారు. బీసీ, ఎస్సీ,ఎస్టీలకు వైసీపీలో ఏమాత్రం ప్రాదాన్యం లేదు. బలహీనవర్గాలకు వైసీపీలో అన్నీ అవమానాలే. ఎవరి పెత్తనంపైనో ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోం. నూజివీడులో అందరితో కలిసివెళ్తూ టీడీపీ జెండా ఎగురవేస్తా అని తెలిపారు. టీడీపీ`జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పార్థసారథికి చోటు దక్కింది. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి ఆయన పోటీ చేయనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :