ఆరు గ్యారంటీలు తప్ప మరేమీ పట్టించుకోం అనేలా : పాయల్ శంకర్
![ఆరు గ్యారంటీలు తప్ప మరేమీ పట్టించుకోం అనేలా : పాయల్ శంకర్](https://www.telugutimes.net/storage/news/news_new_68410.jpg)
తెలంగాణ ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలా చురుగ్గా లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలు తప్ప మరేమీ పట్టించుకోం అనేలా గవర్నర్ తమిళిసై ప్రసంగం ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వాళ్లను గుర్తుచేసుకోవడం మంచిదే కానీ బీజేపీని విస్మరించారన్నారు. ఆ ప్రసంగంలో మన్మోహన్, సోనియాను గుర్తు చేసుకొని, తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ పేరును ప్రస్తావించలేదని చెప్పారు. ఇదంత ప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో కొన్ని హామీలనే ప్రస్తావించారని, మిగతా హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో చెబితే బాగుండేదన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వడమే ప్రభుత్వ విజయం కాదన్నారు. ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంచామన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు అది అమలుకు నోచుకోవడం లేదు. ఆరోగ్యశ్రీ బాధితులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. 60 నుంచి 70 వేల దరఖాస్తులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయో చెప్పాలి అని డిమాండ్ చేశారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)