మా పార్టీని అర్థం చేసుకుని వచ్చిన వారికి స్వాగతం అంటున్న జనసేనాని..
![మా పార్టీని అర్థం చేసుకుని వచ్చిన వారికి స్వాగతం అంటున్న జనసేనాని..](https://www.telugutimes.net/storage/news/news_new_71002.jpg)
పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని చెప్పిన తర్వాత ఓ రకంగా రాష్ట్ర రాజకీయాలలో పిఠాపురం ప్రాముఖ్యత సంతరించుకుంది. కూటమిలో భాగంగా వచ్చిన సీట్లు తక్కువే అయినప్పటికీ పక్క పార్టీల నుంచి జనసేనకు చేరికలు బాగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో కొందరు నేతలు జనసేనలో చేరారు. తమ పార్టీని అర్థం చేసుకొని వస్తున్న అందరికీ స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్. పవన్ పిఠాపురం నుంచి తనను..కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. తాను ఇక్కడి నుంచి గెలిస్తే పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న 54 గ్రామాలలో ఏదో ఒక ఊరిలో తను ఇల్లు ఏర్పాటు చేసుకుంటాను అని ఆయన అన్నారు. అంతేకాదు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పై కూడా పవన్ ఈ సందర్భంగా విమర్శల కురిపించారు. ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ..గాలి తక్కువ..కానీ గాజు పగిలేకొద్దీ పదునెక్కుది అని విమర్శించారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)