వీరమల్లు కోసం రంగంలోకి దిగిన నిర్మాత కొడుకు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో హరిహర వీరమల్లు ఒకటి. పవన్ కెరీర్లోనే ఎక్కువ ఖరీదైన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టార్టయ్యి మూడేళ్లు అయినప్పటికీ ఇంకా పూర్తి కాకపోవడంతో ఫ్యాన్స్ కు కూడా విసుగొచ్చి ఆ సినిమా గురించి ఆలోచించడం మానేశారు. డైరెక్టర్ క్రిష్ ఈ సబ్జెక్ట్ ను పక్కన పెట్టి, వేరే స్క్రిప్ట్ రాసుకోవడంలో బిజీ అయ్యాడని వార్తలు కూడా వచ్చాయి.
ఇక నిర్మాత ఏఎం రత్నం మాత్రం కనిపించినప్పుడు మొక్కుబడిగా త్వరలోనే రిలీజ్ అంటూ చెప్పుకొస్తూ ఉన్నాడు. అయితే వీరమల్లు సినిమా బడ్జెట్ రోజురోజుకీ పెరిగిపోవడంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వీరమల్లుకు దర్శకత్వం వహించకపోయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను ఫాస్టప్ చేయించనున్నాడని సమాచారం.
అంతేకాదు బ్యాలెన్స్ ఉన్న 40 రోజుల షూటింగ్ కు సంబంధించిన షెడ్యూల్స్, ఖర్చులు, నటీనటుల కాల్షీట్స్ ను కూఆ జ్యోతి కృష్ణ రివ్యూ చేస్తున్నట్లు టాక్. కానీ పవన్ ప్రస్తుతం షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయ్యాడు. ఎలక్షన్స్ అయ్యే వరకు పవన్ మళ్లీ షూటింగుల్లో పాల్గొనేలా కనిపించడం లేదు. ఎంత లేదన్నా వీరమల్లు రిలీజ్ కావాలంటే మరో ఏడాది కచ్ఛితంగా ఆగాల్సిందే.