ASBL NSL Infratech

జనసేన అభ్యర్థులకు బీఫామ్ లు అందజేసిన పవన్

జనసేన అభ్యర్థులకు బీఫామ్ లు అందజేసిన పవన్

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌  బీఫామ్‌లు అందజేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 21 అసెంబ్లీ, ఇద్దరు లోక్‌సభ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత నాదెండ్ల మనోహర్‌కు బీఫామ్‌ అందజేశారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఆధోగతి పాలైందన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్‌నిర్మించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. ప్రజలే దేవుళ్లు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానికి కృషి చేస్తాం. విద్య, ఉపాధి అవకాశాలు, అభివృద్ధికి కంకణబద్ధులై పనిచేస్తాం. వలసలు లేని, పస్తులు లేని వికసిత ఏపీ ఏర్పాటు మనందరి బాధ్యత. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం. అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టాలి. అందరూ కలిసి పనిచేయాలి. ప్రజల్లోకి వెళ్లాలి. వివాదాలకు తావులేకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని పార్టీ అభ్యర్థులకు  దిశానిర్దేశం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :