ఓపెన్ఏఐ సీఈఓ కీలక ప్రకటన
![ఓపెన్ఏఐ సీఈఓ కీలక ప్రకటన](https://www.telugutimes.net/storage/news/news_new_73932.jpg)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా బిలియనీర్ల ర్యాంక్ జాబితాలో చేరిన ఆయన తన సంపదలో పెద్ద మొత్తాన్ని సమాజానికి తిరిగి ఇస్తానని ప్రకటించారు. తన భాగస్వామి ఆలివర్ మల్హెరిన్ను కలిసి ది గివింగ్ ప్లెడ్జ్ దాతృత్వ కార్యక్రమంపై సంతకం చేశారు. నవీన సమాజ నిర్మాణానికి ఎంతోమంది కృషి చేశారు. ఈ ప్రపంచాన్ని మెరుగుపరచడానికి వారు చేసిన కృషి, మేధస్సు, దాతృత్వం, అంకితభావం లేకుంటే మేం ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఆల్ట్మన్ తెలిపారు. తన ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతీ వ్యక్తికి ఆల్ట్మాన్, ముల్హెరిన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే సమాజ పురోగతికి అవసరమయ్యే సాంకేతికతకు మద్దతిస్తూ తమ దాతృత్వాన్ని కొనసాగించడంపై దృషి కేంద్రీకరిస్తామని ఈ జంట తెలిపింది.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)