ASBL NSL Infratech

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంగం ఆధ్వర్యంలో మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ వేడుకలు

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంగం ఆధ్వర్యంలో మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ వేడుకలు

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంగం మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరం నడిబొడ్డున గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో నైటా ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ ఆధ్వర్యంలో ఘనంగా వైభవోపేతంగా జరిగినవి. దాదాపు 500 లకు పై చిలుకు ఆహ్వానితులు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పేరిని నాట్యం మరియు రాగిన్ బ్యాండ్, మరియు స్థానిక సాంస్కృతిక కళాకారుల నృత్య ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకుంది. నైటా నిర్వాహకుల సమిష్టి కృషి ఫలితంగా కార్యక్రమం చక్కటి ప్రణాళికతో సజావుగా జరిగింది. సెక్రటరీ రవీందర్ కోడెల కార్యక్రమాన్ని ప్రారంభిచగా, యాంకర్ లక్ష్మి గారు చక్కటి వాగ్దాటితో కార్యక్రమాన్ని నడిపించారు. చిన్నారుల గణేశాలాపనతో మరియు స్థానిక కళాకారుల నృత్య ప్రదర్షణతో కార్యక్రమం మొదలవగా పేరిని కళాకారుల నృత్యప్రదర్షణ మొట్ట మొదటిసారిగా అమెరికా గడ్డ పై ప్రత్యక్షంగా ప్రదర్శించడం ఎంతో హర్షదాయకం.

సందీప్ నేత్రుత్వంలో కిరణ్, రోహిత్, ఇంద్రజ మరియు అభినయ బృందం వినాయకగద్యం, రామాయణ గట్టం, జూగాల్బండి, ఆకాశలింగ, సమీకరణం, వాయు లింగ, దేవికైవారం, నరసింహ ఘట్టం, శివకల్యాణనమ్, నవ దుర్గ ఘట్టం, ప్రదర్శనతో న్యూయార్క్ వాసులని మైమరిపించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వాణి మాట్లాడుతూ, తెలంగాణలో ప్రసిద్ధి చెందిన, మరుగు పడిపోయిన కాకతీయుల కాలంనాటి ప్రాచీన నృత్యాన్ని సజీవంగా నిలిపి, మొట్టమొదటి సారిగా న్యూయార్క్ నగరంలో ప్రదర్శన జరిపించడం ప్రత్యేకంగా తన ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంగం తరుపున ఎంతో ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా పేరిని నాట్య ప్రదర్శనం టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పేరిని నత్యాన్ని సామాజిక మధ్యమాల ద్వారా తెలియచేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాని అని ప్రెసిండెంట్ వాణి గారు తెలియచేసారు.  ఈ సందర్బంగా సహకరించిన పెద్దలు పైళ్ళ మల్లా రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.

నైటా మహాశివరాత్రి మరియు ఉమెన్స్ డే సందర్భంగా పేరిని నాట్య ప్రదర్శన తో పాటు స్థానిక యంగ్ కిడ్స్ నృత్య మరియు స్కిట్స్ ప్రదర్శనలు ప్రేక్షకులును ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళా దినోత్సవం సందర్బంగా అమితాబ్ బచ్చన్ పోయెట్రీ సాంగ్ తో చేసిన్స్ నృత్య రూపకం ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు.  ఒక మహిళా అధ్యక్షురాలుగా ఈ ప్రధర్శనం తన మనస్సుకు ఎంతో అనంధాన్ని ఇచ్చినది అని వాణి గారు వ్యక్తపరిచారు. ప్రతిగా నృత్య రూపకాలని రూపొందించిన నృత్య దర్శకులందరిని జ్ఞాపికలు మరియు శాలువాలని అందిచడం జరిగింది.

ఈ కార్యక్రమం సంధర్భంగా నైటా 2024 సావేనేయర్ ని విడుదల చేయడం జరిగింది. ఈ సావేనేర్ రూపకల్పన లో తొడ్పడిన నైటా టీం ముఖ్యంగా పవన్ రవ్వ, సౌమ్య చిట్టారి, శ్రీనివాస్ గూడూరు, ఉషా మన్నెం, హరిచరణ్ బొబ్బిలి, రవీందర్ కోడెల గారికి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఈ సంచికకు ప్రత్యేక అనువాదకురాలుగా( చీఫ్ ఎడిటిర్) వ్యవహరించడం ద్వారా ప్రెసిడెంట్ వాణి గారు ఆనందాన్ని తెలియచేసారు. ఈ సంంచికను ప్రింట్ చేయడంలో తొడ్పడిన దాతలు, రచయితలు, చిన్నారుల పెయింటింగ్, బిజినెస్ అడ్వర్టిసేమెంట్ హోల్డర్స్ అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.

నైటా సంబరాలు సందర్బంగా ఏర్పాటు చేసిన శివలింగం డెకొరేషన్ ప్రతేక ఆకర్షణంగా నిలిచింది. దీన్ని తయారుచేయడానికి ఎంతో శ్రమతో కష్టపడి చేసి కార్యక్రమములో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిన ప్రదర్శనకి కృషి చేసిన శ్రీమతి పద్మ కోడెల గారిని ప్రెసిడెంట్ వాణి గారు ఎంతో ఆనందాన్ని వ్యక్త పరుస్తూ ఈ సందర్బంగా శాలువా మరియు మెమెంటో తో శ్రీమతి సాధన పైళ్ళ మల్లా రెడ్డి గారి చే సన్మానించడం జరిగింది. 

నైటా సంబరాలు సందర్భంగా చివరగా ఏర్పాటు చేసిన “రాగిన్ బ్యాండ్” సంగీత విభావరి ఏకధాటిగా రెండు ఘంటల పాటు కొలహాలంగా కేరింతలతో సాగింది. రాగిన్ బ్యాండ్ తమ యొక్క ప్రదర్శన మొట్టమొదటి సారిగా న్యూయార్క్ మహానగరంలో నైటా  ఆధ్వర్యంలో పరిచయం అవ్వడం చాలా ఆనందాన్ని వ్యక్త పరిచారు.

ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వాణి మాట్లాడుతూ, న్యూయార్క్ మహానగరంలో మొట్ట మొదటి సారిగ నైటా ఆధ్వర్యంలో పేరిని మరియు రాగిన్ బ్యాండ్ ప్రదర్శన జరుపుకోవడం చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు.

మార్చ్ 23, 2024 రోజు న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంగం ఆధ్వర్యంలో జరిగిన నైటా సంబరాలు, మహాశివరాత్రి అండ్ ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగినవి. ఈ సందర్భంగా సహకరించిన, సంస్థ శ్రేయోభిలాషులు Dr. పైళ్ళ మల్లా రెడ్డి గారికి నైటా కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. 
అదేవిధంగా కార్యక్రమనికి సహకరించిన ధాతలందరికి మరియు కార్యక్రమానికి వచ్చిన కమ్యూనిటీ మెంబెర్స్ అందరికి ప్రెసిడెంట్ వాణి ధన్యవాదములు తెలియచేయడం జరిగింది.

ప్రత్యేకంగా, ఈ కార్యక్రమానికి అహర్నిశలు కృషిచేసిన తన కార్యవర్గం, పవన్ రవ్వ, సౌమ్య, రవీందర్ కోడెల, హరిచరణ్ బొబ్బిలి, సుధీర్ చూవ్వా, హారిక జంగం, హేమ వెంకట, షాలిని మేఖల గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

మరీ ముఖ్యంగా సహాయ సహకారాలు అందించిన బోర్డు అఫ్ డైరెక్టర్స్ మరియు అడ్వైసరీ మెంబెర్స్ అయిన చైర్మన్ Dr. రాజేందర్ రెడ్డి  జిన్నా, వైస్  చైర్మన్ లక్ష్మణ్ అనుగు, సతీష్ కల్వ, Dr. కృష్ణ భాదే, ఉషా మన్నెం, మల్లిక్ రెడ్డి, సహోదర్ రెడ్డి, వేణు రెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి గడ్డం, అడ్వైసర్స్, శ్రీనివాస్ గూడూరు, రమ వనమ, చిన్న బాబు రెడ్డి, మధుసూదన్ రెడ్డి గారిలకు ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది.

ఈ కార్యక్రమం సందర్భంగా నైటా చక్కటి విందు భోజనం ఏర్పాటు చేయటం జరిగింది.

చివరగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మన టీవీ ప్రతినిధులు రాగిణి మరియు తమ యొక్క టీంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయటం జరిగింది.

 

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :