ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో.. నిర్మలమ్మ, జైశంకర్
![ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో.. నిర్మలమ్మ, జైశంకర్](https://www.telugutimes.net/storage/news/news_new_69206.jpg)
కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు వెల్లడిరచారు. అయితే వారు ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారనేదానిపై బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. వారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయం దాదాపుగా ఖరారైంది. అయితే వారు ఏఏ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతారనేది ఇంకా ఖరారు కాలేదు అని జోషి వెల్లడించారు. వారు పోటీ చేసే స్థానాల్లో బెంగళూరు ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పుడు నేనెలా సమాధానం చెప్పగలను అని అన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :