ASBL NSL Infratech

ఈ నెల 11 నుంచి లోకేశ్ శంఖారావం.. ఎన్నికల ప్రచారం

ఈ నెల 11 నుంచి లోకేశ్ శంఖారావం.. ఎన్నికల ప్రచారం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు శంఖారావంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర నుంచి శంఖారావం ప్రారంభం కానుందని, యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళికలు ఉంటాయన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపడమే శంఖారావం లక్ష్యం. రోజూ 3 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. సుమారు 50 రోజుల పాటు కొనసాగుతుంది. ఇచ్ఛాపురంలో ఈ నెల 11న తొలిసభ నిర్వహిస్తాం. జగన్‌ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పిస్తాం అని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :