ASBL NSL Infratech

హత్యా రాజకీయాలు అపకపోతే.. నారా లోకేష్

హత్యా రాజకీయాలు అపకపోతే.. నారా లోకేష్

వైసీపీ ఓడిపోయినా జగన్‌ రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. కర్నూలులో టీడీపీ నేత గౌరీనాథ్‌ను వైసీపీ నేతలు దారుణంగా హత్య చేయించారని ఆరోపించారు. ఆ పార్టీ ఫ్యాక్షన్‌ పాలన వద్దని ఎన్నికల్లో జనం చీకొట్టరన్నారు. బాబాయ్‌ని చంపినట్టే జనాన్ని జగన్‌ చంపుతున్నారని మండిపడ్డారు. హత్యా రాజకీయాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గౌరీనాథ్‌ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్‌ హామీ ఇచ్చారు. నిందుతులను వదిలే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ దాడులకు చెక్‌ పెట్టి శాంతి భద్రతలను కాపాడతామని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :