ASBL NSL Infratech

గ్లాసుకు బై.. ఫ్యానుకు హాయ్ అంటున్న నంద్యాల జనసేన కోఆర్డినేటర్..

గ్లాసుకు బై.. ఫ్యానుకు హాయ్ అంటున్న నంద్యాల జనసేన కోఆర్డినేటర్..

ఆంధ్రాలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నడూ కనివిని ఎరుగని విధంగా జనసేన పార్టీ నాయకులు పార్టీలు మారుతున్నారు. సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకున్న వారు పవన్ కూటమి ఒప్పందం పుణ్యమా అని సీట్లు దక్కక తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఫ్యాను నీడకి చేరుకుంటున్నారు. ప్రస్తుతం నంద్యాలకు చెందిన ఓ కీలక నేత కూడా ఇదే పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆ నేత.. పొత్తులో భాగంగా టికెట్ దక్కక తీవ్ర నిరాశకు గురి అయ్యారు. దీంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ నేత మరెవరో కాదు నంద్యాల జనసేన కోఆర్డినేటర్ విశ్వనాథ్. ఈ మేరకు విశ్వనాధ్ ను శిల్పా మోహన్ రెడ్డి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక విశ్వనాధ్ వెనక భారీగా జనసేన నాయకులు వైసీపీ కండువా కప్పుకున్నారు. మొత్తానికి జనసేనానికి పొత్తు వల్ల సొంత ఇంట్లో రచ్చ మిగులుతోంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :