చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి : బాలయ్య
తన నియొజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ అన్నారు. స్థానిక టీడీపీ నాయకులు, అభిమానుల మధ్య ఆయన 64వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని పున ప్రారంభించారు. అనంతరం స్థానిక జేవీఎస్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో బాలయ్య మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. దీంతో పాతికేళ్లు వెనక్కి వెళ్లాం. ప్రభుత్వం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు టీడీపీ అఖండ విజయాన్ని అందించారు. ప్రజల నమ్మకాన్ని మేము వమ్ము చేయబోం. హిందూపురానికి పరిశ్రమలు, హంద్రినీవా ద్వారా అన్ని చెరువులకు నీరు అందించేందుకు కృషి చేస్తాం. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగమిస్తుంది అని అన్నారు.
Tags :